మొత్తం 33 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం.
ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి @ జలవనరులశాఖ పనులకు సంబంధించి మరో 11అంశాలకు ఆమోదం. ఏపీ సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ (4.0) 2025-30కి ఆమోదం. పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపు మార్గదర్శకాలకు ఆమోదం. అధికారిక భాష కమిషన్ పేరు మార్పునకు కేబినెట్ ఆమోదం. మండలి వెంకట కృష్ణారావు అధికారిక భాష కమిషన్’గా మార్పునకు ఆమోదం. సాగుభూమిని వ్యవసాయేతరంగా మార్పునకు నాలా చట్ట సవరణలకు ఆమోదం. 51వ సీఆర్డీఏ సమావేశం ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. రాజధాని పరిధి 29 గ్రామాల్లో రూ.904 కోట్లతో మౌలిక వసతులకు ఆమోదం. సీఆర్డీఏ పరిధిలో సంస్థలకు భూకేటాయింపునకు ఆమోదం. మంత్రి వర్గ ఉపసంఘం సిఫార్సులకు కేబినెట్ ఆమోదం.











