Sunday, 10 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

మొత్తం 33 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం.

ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి @ జలవనరులశాఖ పనులకు సంబంధించి మరో 11అంశాలకు ఆమోదం. ఏపీ సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ (4.0) 2025-30కి ఆమోదం. పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపు మార్గదర్శకాలకు ఆమోదం. అధికారిక భాష కమిషన్ పేరు మార్పునకు కేబినెట్ ఆమోదం. మండలి వెంకట కృష్ణారావు అధికారిక భాష కమిషన్’గా మార్పునకు ఆమోదం. సాగుభూమిని వ్యవసాయేతరంగా మార్పునకు నాలా చట్ట సవరణలకు ఆమోదం. 51వ సీఆర్డీఏ సమావేశం ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. రాజధాని పరిధి 29 గ్రామాల్లో రూ.904 కోట్లతో మౌలిక వసతులకు ఆమోదం. సీఆర్డీఏ పరిధిలో సంస్థలకు భూకేటాయింపునకు ఆమోదం. మంత్రి వర్గ ఉపసంఘం సిఫార్సులకు కేబినెట్ ఆమోదం.

ఆంధ్రప్రదేశ్

మంత్రివర్గ భేటీకి ముందు ఎమ్మెల్యేల వివాదస్పద ఘటనలపై మంత్రులతో నారా లోకేశ్ ప్రస్తావన

ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి @ దగ్గుబాటి ప్రసాద్, కూన రవి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నజీర్ అహ్మద్ అంశాల ప్రస్తావన. శ్రీకాంత్‍కు పెరోల్ సిఫార్సు చేసిన కోటంరెడ్డి, సునీల్ అంశాలపై ప్రస్తావన. అనంతపురం, శ్రీశైలం ఎమ్మెల్యేలు సహా ఏడుగురి తీరు సరికాదన్న లోకేశ్. సీఎం కూడా ఏడుగురు ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై ఆగ్రహంతో ఉన్నారన్న లోకేశ్. పెరోల్ విషయాల్లో ఎమ్మెల్యేలు సిఫార్సు చేస్తే ఆచితూచి వ్యవహరించాలని అనితకు సూచన. దివ్యాంగుల పింఛన్ల తొలగింపుపై ఫిర్యాదులను లోకేశ్ దృష్టికి తెచ్చిన మంత్రులు. అర్హులు నష్టపోకుండా పింఛన్లు ఇచ్చేలా చర్యలు తీసుకుందామన్న లోకేశ్.

క్రైమ్

పోక్సో చట్టానికి స్త్రీ పురుషులనే వివక్ష లేదు

ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి @ లైంగిక వేధింపులకు పాల్పడితే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే. పోక్సో చట్టంపై స్పష్టతనిచ్చిన కర్ణాటక హైకోర్టు. కర్ణాటకలో 13 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ 48 ఏళ్ల ఉపాధ్యాయురాలిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు. తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన మహిళ. ఈ కేసు విచారిస్తూ పోక్సో చట్టానికి లింగ వివక్ష ఉండదని, నేరం చేసింది పురుషులైనా, మహిళలైనా సమాన శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేసిన కర్ణాటక హైకోర్టు జస్టిస్ ఎం.నాగప్రసన్న. దేశంలో లైంగిక వేధింపులకు గురవుతున్న వారిలో 54.4% బాలురు, 46.6% బాలికలు ఉంటున్నారని పేర్కొన్న హైకోర్టు న్యాయమూర్తి. ఐపీసీలోని అత్యాచార చట్టం తరహాలోని కేవలం పురుషులని మాత్రమే నిందితులుగా నిర్ధారించాలని కోరిన నిందితురాలి తరపు న్యాయవాది. ఈ వాదనను తిరస్కరిస్తూ పోక్సో కేసులో లైంగిక వేధింపులు అనేది ఐపీసీలో అత్యాచారం లాంటిది కాదని స్పష్టం చేసిన న్యాయమూర్తి. తగిన ఆధారాలు సేకరించి నిందితురాలికి వెంటనే శిక్ష విధించాలని ట్రయల్ కోర్టును ఆదేశించిన కర్ణాటక హైకోర్టు.

భక్తి

65 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం ఉచిత తిరుపతి బాలాజీ దర్శనం.

ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి @ తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించాలనుకునే 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు శుభవార్త. 65 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రెండు ప్రత్యేక ఉచిత దర్శన స్థలాలు కేటాయించబడ్డాయి. ఉదయం 10:00 మధ్యాహ్నం 3:00 మీరు S-1 కౌంటర్ వద్ద ఫోటో ID మరియు వయస్సు రుజువును సమర్పించాలి. మార్గదర్శకాలు: వంతెన క్రింద ఉన్న గ్యాలరీ ద్వారా ఆలయం యొక్క కుడి వైపు గోడకు వెళ్లండి. ఏ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు. సాగు స్థలం అందుబాటులో ఉంది. దర్శనం తర్వాత, మీకు ఉచితంగా వేడి సాంబార్ అన్నం, పెరుగు అన్నం మరియు వేడి పాలు అందించబడతాయి. సౌకర్యం కోసం బ్యాటరీ కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి, నిష్క్రమణ గేటు వద్ద ఉన్న కార్ పార్కింగ్ ప్రాంతం నుండి కౌంటర్ వరకు మిమ్మల్ని రవాణా చేస్తాయి. ఎటువంటి బలవంతం లేదా ఒత్తిడి ఉండదు — దర్శనం ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ల కోసం కేటాయించబడింది. దర్శన క్యూలో ఒకసారి, మీరు మీ దర్శనం మరియు నిష్క్రమణను కేవలం 30 నిమిషాల్లో పూర్తి చేసుకోవచ్చు. TTD తిరుమల హెల్ప్‌డెస్క్ కాంటాక్ట్ నంబర్: 8772277777

భక్తి

మేడారం సమ్మక్క సారక్క జాతర పై మంత్రి సీతక్క

ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి @ మేడారం సమ్మక్క సారక్క జాతర పై మంత్రి సీతక్క మేడారం జాతరకు గతంలో ఎన్నడూ లేని విధంగా 150 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చే ఏడాది సమ్మక్క సారక్క జాతర జనవరి 22 నుంచి. తాత్కాలిక పనులతో ఇప్పటివరకు జాతర పనులు జరిగాయి. ఈ సారి కొత్త ప్రణాళికలతో పనులు చేపట్టి జాతర రూపు రేఖలు మార్చుతాం. శాశ్వత పనులు చేస్తున్నాం. జంపన్న వాగు, రోడ్ల వెడల్పు , అభివృద్ధి పనులు చేస్తాం. స్మృతి వనాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాం. 12 వేల మంది పోలీస్ సిబ్బందితో జాతర బందోబస్తూ జరుగుతుంది. 13 వ శతాబ్ది చరిత్రను తర్వాతి తరాలకు అందించాలని జాతరను ప్రతిష్టాకంగా జరుపుతాం మంత్రి సీతక్క. పంచాయతీ రాజ్ శాఖ లో రేపటి నుంచి పనుల జాతర మొదలు అవుతుంది. పనుల జాతరకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రులు సీతక్క , అడ్లూరి లక్ష్మణ్. పంచాయతీ రాజ్ శాఖలో లక్షా 15 వేల పనులు రేపటి నుంచి మొదలు అవుతాయి. ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్లు, గొర్ల, మేకల షెడ్లు , తదితర పనులు రేపటి నుంచి మొదలవుతాయి. ఈ పనుల కోసం ప్రభుత్వం 200 కోట్లను నిధులను విడుదల చేసింది. పంచాయతీ పనుల కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొనాలి.

బిజినెస్

GSTలో రెండు శ్లాబులకు మంత్రుల బృందం ఓకే

ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి @ GSTలో రెండు శ్లాబులకు మంత్రుల బృందం ఓకే GSTలో రెండు శ్లాబుల ప్రతిపాదనను మంత్రుల బృందం ఆమోదించింది. ప్రస్తుతం జీఎస్టీలో 4 శ్లాబులు ఉండగా వాటిని రెండుకు (5%, 18%) కుదిస్తూ ఇటీవల కేంద్ర ఆర్థికశాఖ మంత్రుల బృందానికి ప్రతిపాదన పంపింది. దీనికి జీఎస్టీ మండలి కూడా ఆమోదం తెలిపితే రెండు శ్లాబుల విధానం దేశమంతటా అమలులోకి వస్తుంది.

భక్తి

వినాయక ఉత్సవాలకు ఆన్లైన్లో అనుమతులు పొందవచ్చు.

ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి @ వినాయక ఉత్సవాలకు అనుమతుల కోసం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రత్యేకంగా ganeshutsav.net అనే వెబ్సైట్ ను ప్రారంభించింది. మండపాల నిర్వాహకులు ఈ వెబ్సైట్ ద్వారా సింగిల్ విండో విధానంలో ఆన్లైన్లో అనుమతులు పొందవచ్చు. అనుమతులు పొందడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత, సంబంధిత పోలీస్ అధికారి మండప స్థలాన్ని తనిఖీ చేసి, నిబంధనల ప్రకారం ఉంటే QR కోడ్తో కూడిన నిరభ్యంతర పత్రాన్ని (NOC) జారీ చేస్తారు. బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేసే వినాయక మండపాలకు మాత్రమే ఈ అనుమతులు తప్పనిసరి. ఈ ఆన్‌లైన్ వ్యవస్థ ఉత్సవాలను సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించడానికి ఉద్దేశించబడింది : డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.

ఖమ్మం

బిజెపి తెలంగాణ అధ్యక్షుడికి సొయా లేదు. మంత్రి తుమ్మల

ఖమ్మం ఆగష్టు ( పున్నమి ప్రతి నిధి) తెలంగాణ బిజెపి అధ్యక్షుడికి సొయా లేదని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు విమర్శించారు. సకాలంలో లో రైతు లకి యూరియా అందక పోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం అని అన్నారు.ఇది తెలియకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రామ చంద్ర రావు లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ ల పోరాటం తోనే కేంద్రం ప్రభుత్వం దిగి వచ్చింది అని అన్నారు. End

భక్తి

రాజా సాయి మందిరం లో అన్న దానం

ఖమ్మం ఆగష్టు ( పున్నమి ప్రతినిధి) ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వంగ ముత్యాల బంజర్ లో ఉన్న శ్రీ రాజా సాయి మందిరం లో గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మోరంపూడి గోపి ప్రసాద్ రాజ్ హైదరాబాదులో ఉద్యోగం వచ్చిన సందర్భంగా తల్లిదండ్రులు ప్రకాష్ రాజ్ శ్రీదేవి దంపతులు తుమ్మలపల్లి. కీర్తిశేషులు లకిరెడ్డి ఆదినారాయణమ్మ వర్ధంతి సందర్భంగా వారి అల్లుడు తలప రెడ్డి ప్రతాపరెడ్డి ప్రతాప్ డైరీ కల్లూరు సహకారం తొ అన్న దాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదానకార్యక్రమం లో ఆలయ అర్చకులు సాయి మణికంఠ యామని, రాధిక, ఉమారాణి, ఎల్విఆర్ కే దత్తు, బేబీ, జన్నారెడ్డి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఖమ్మం

బిజెపి ఖమ్మం జిల్లా యువ నేత ప్రెస్ మీట్

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతి నిధి ) ఖమ్మం జిల్లా కి ముగ్గురు మంత్రులున్న అభివృద్ధి మాత్రం శున్యం అని బిజెపి ఖమ్మం జిల్లా యువ నాయకులు వాళ్ళలా రమేష్ అన్నారు. గురు వారం స్థానిక సమస్య ల మీద ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రమేష్ మాట్లాడుతూ ఖమ్మం బైపాస్ నుండి కామంచి కల్ వెళ్లే రహదారి సమస్య ఇప్పటి ది కాదు అని పార్లమెంట్, శాసన సభ, స్థానిక సంస్థల ఎన్నికల సమయం లో ఇదే అంశం ని ప్రధాన ఎజెండా గా మార్చుకొని ఓట్లు వేయించుకొని గెలిచినా తరువాత పట్టించుకునే నాయకుడే లేరన్నారు. ఈ సమస్య కి వెంటనే పరిష్కారం చూపకపోతే బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం అని రమేష్ హెచ్చరించారు. ఈ సమావేశం లో ఏపూరి నాగేశ్వరరావు, గజ్జల శ్రీనివాస్, అంకర్ల వీరబాబు, ములుగు చందు, కందుల శ్రీకృష్ణ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, టిడిపి పార్టీ నాయకులు ఆటో కార్మికులు పాల్గొనడం జరిగింది

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.