Saturday, 9 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

ఆహారంలో నెయ్యి వాడకం మంచిదా.. కాదా ?

సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి @నెయ్యి వాడకం: నెయ్యి అనేది ముఖ్యమైన దినుసు అని సిధ్ధుల మాట. దాని ఔషధ గుణాలను ఈ రోజు ఉన్న పరిజ్ఞానం కంటే ఎంతో ముందు పరిశోధించారు. ఎన్నో ఔషధ గుణాలను కలిగిన నెయ్యిని ఎలా తయారు చేయాలో చూద్దాం. పాలు బాగా కాచినేని,చల్లారక కాస్త పెరుగు తోడు పెడితే ఆరు ఎనిమిది గంటలలో పెరుగు తయారౌతుంది. ఈ పెరుగులో కాసిని నీళ్లు పోసి కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది. దాన్ని ఒక గిన్నెలో వేసి కాస్తే అది కరుగుతుంది. అందులో ములగాకు కాస్త వేస్తే చక్కగా పొంగుతుంది. చక్కటి సువాసన వస్తుంది. పూర్తిగా కరిగాక, దింపి వడకట్టి జాగ్రత్త చేసుకోవాలి. ఈ రకంగా చేస్తే నెయ్యి ఎక్కువ కాలం పాడుగాకుండా ఉంటుంది. ఈ నెయ్యిలో ఔషధ గుణాలుఉన్నాయి. రెండు వేల సంవత్సరాలు ముందే సిద్ధ ఆయుర్వేద చికిత్సలో నెయ్యి విరివిగా ఉపయోగించేవారు. ఔషధ గుణాలు కలిగిన అణువుల గోడలు పారదర్శకంగా ఉండడం వలన ఔషధాల తయారీలో నెయ్యి ఎక్కువగా వాడేవారు. ఔషధం చెడిపోకుండా నెయ్యి ఒక ప్రిజర్వేటివ్ గా పని చేస్తుంది. నెయ్యి ఒక రసాయనం అని ఆయుర్వేదం చెబుతుంది. పూర్తి శరీర ఆరోగ్యాన్నిచ్చే గుణాలు నెయ్యిలో ఎన్నో ఉన్నాయి. ఈ రకంగా నెయ్యి సిధ్ధ ఆయుర్వేద వైద్యులకు ఒక మంచి నేస్తంగా, తయారైన మందులను చెడిపోకుండా ఉండేందుకు బాగా సహాయకారిగా ఉంటుంది. ఒక గరిటెడు నెయ్యిలో 14 గ్రాముల కొవ్వు శక్తి ఉంటుంది. జీర్ణ శక్తిని పెంపొందించే జఠరాగ్నిని నియంత్రించడం చేస్తుంది. మ్యూకస్ మెంమ్బ్రేన్ ను బల పరుస్తుంది. నెయ్యిలో ఉప్పు, లాక్టోజ్ వంటివి లేవు. లాక్టోజ్ ఇన్టాలరెన్స్ (పాల పదార్థాలు పడక పోవడం) ఉన్న వారు నెయ్యి వాడుకోవచ్చు. కాన్సర్, వైరస్ అనారోగ్యాలు కూడా నెయ్యితో కంట్రోల్ చేయవచ్చు. నెయ్యిలో CLA – Conjulated Linoleic Acid ఉంది. ఇది ఊబ కాయం తగ్గిస్తుంది. అలాగే ఒమేగా 3 ఆమ్లాలు నెయ్యిలో విరివిగా ఉన్నాయి. ఇది మెదడుకు చాలా మంచిది. నెయ్యిలో Saturated fat – 65% Mono – unsaturated fat – 32% Linoleic – unsaturated fat -3% ఇన్ని విలువలు ఉన్న నెయ్యిని ఏ రకంగా వాడుకోవచ్చో తెలుసుకుందాం. నెయ్యి కరిగించి, మజ్జిగ చిలికి వాడాలని సామెత”. అంటే, నెయ్యిని కరిగించి, వేడి అన్నంలో కలుపుకుని తినాలి. దాని వలన దేహానికి చలువ చేస్తుంది. దోశను నూనె బదులుగానెయ్యితో కాల్చండి. నేతితో పత్యం కూడా చేయవచ్చు. మలబద్ధకం, వాతం, కఫంతో పాటు అనేక ఇతర అనారోగ్యాలు కూడా తగ్గుతాయి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. శరీరానికి కాంతిని ఇస్తుంది. కంటి నరాలు బల పడి కంటి చూపు బలపడుతుంది/మెరుగు పడుతుంది. శరీర పటుత్వం పెరుగుతుంది. కొందరు ఎప్పుడూ అలసటతో శరీరంలో శక్తి లేకుండా ఉంటారు. కాస్త దూరం నడిచినా ఆయాసపడి పోతారు. వెంటనే కాళ్ళ నొప్పితో కూలబడిపోతారు. ఇటువంటి వారికి మధ్యాహ్నం భోజనంలో నెయ్యి వేసుకొని తింటే మంచిది. విపరీతంగా ఉపవాసాలు ఉండే వారు, సమయానికి భోజనం చేయని వారూ జీర్ణ వ్యవస్థలో ఉండే ఆమ్లాలతో అల్సర్ బారినపడి బాధ పడుతూ ఉంటారు. నోటి పూతతో బాధ పడేవాళ్ళు, ఎక్కువగా కారం తినే వాళ్ళు, ఆల్కహాల్ తాగే వారు, మత్తు మందులకు అలవాటు పడ్డవాళ్ళు, ఒత్తిడి గలవారు, ఇలాంటి వారందరికీ కడుపులో అల్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. వీటి అన్నింటికీ నెయ్యి వాడకం ఎంతో మేలు చేస్తుంది.

ఖమ్మం

ఖమ్మం మున్నేరు వరద కీ ఏడాది..

ఖమ్మం పున్నమి ప్రతినిధి సరిగ్గా ఏడాది క్రితం ఖమ్మం నాగరాణ్ణి మున్నేరు ముంచేసింది. ఆ సంఘటన ని తలుచుకుంటే నే ఆ ప్రాంత వాసులు హడలి పోతున్నారు. ఎంతో జన, ధన నష్టం జరిగినది. నిద్రలేకుండా బిక్కు బిక్కు అంటూ గడిపిన రాత్రులు ఇప్పటికి ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఈ సంవత్సరము కుడా భారీ వర్షాలు ఉన్న ఇక్కడ వర్షం ఉన్నప్పుడు పై నుండి నీరు రాకపోవడం. పై నుండి నీరు వచ్చేటప్పుడు ఇక్కడ వర్షం లేకపోవడం వల్ల భారీ ప్రమాదమె తప్పింది అని ప్రజలు భావిస్తున్నారు.

నాగర్‌కర్నూల్

నాగర్ కర్నూల్ జిల్లాలో వినాయక నిమజ్జనంలో జిల్లా ఎస్పీ

పున్నమి ప్రతినిధి ఆగస్టు 31 నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్ లో ఏర్పాటుచేసిన వినాయకుని నిమజ్జనం ఆదివారం సాయంత్రం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పాల్గొన్నారు. పోలీస్ సిబ్బందితో కలిసి ఆయన నిమజ్జనంలో పాల్గొని సరదాగా గడిపారు. వినాయక నిమజ్జనాన్ని ప్రతి ఒక్కరు ప్రశాంతంగా నిర్వహించాలని నాగర్కర్నూల్ జిల్లా ప్రజలకు ఆయన సూచించారు

నాగర్‌కర్నూల్

సోమశిల లో బిజినేపల్లి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం

పున్నమి ప్రతినిధి ఆగస్టు 31 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండల ముఖ్య నాయకులు సోమశిల ప్రాంతంలో ముఖ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మండల నాయకులు అల్లిపూర్ వెంకటస్వామి గారు వట్టెం అమృత్ రెడ్డి గారు లట్టుపల్లి ప్రేమ్ నాయక్ గారు, వెంకట్ రెడ్డి గారు చేతన్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీను గారు, వట్టెం నీళ్ల రామకృష్ణ గారు, తదితరులు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

నాగర్‌కర్నూల్

లింగసానిపల్లి బ్రిడ్జి తో 8 గ్రామాల ప్రజల,రైతుల ,విద్యార్థుల చిరకాల స్వప్నం సాకారం*

పున్నమి ప్రతినిధి ఆగస్టు 31 నాగర్ కర్నూలు జిల్లా బిజినాపల్లి మండలం లింగసానిపల్లి బ్రిడ్జి తో 8 గ్రామాల ప్రజల,రైతుల ,విద్యార్థుల చిరకాల స్వప్నం సాకారం* ఈరోజు గత ప్రభుత్వంలో 3.5 కోట్లతో నిర్మించిన లింగసానిపల్లి వంతెనపై తెలంగాణ తొలి సీఎం కేసీఆర్,మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపిన ఆయా గ్రామాల ప్రజలు* *“దశాబ్దాలుగా ఎదురుచూసిన ఈ బ్రిడ్జి మా గ్రామాలకు ఊపిరి పోసింది. రవాణా సౌకర్యాలు మెరుగుపడి, విద్యార్థులకు, రైతులకు పెద్ద ఉపశమనం లభించింది. ఈ చారిత్రాత్మక క్షణాన్ని మా తరతరాలు గుర్తుంచుకుంటాయి” అని భావోద్వేగంగా పేర్కొన్నారు.* *నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని,లింగసానిపల్లి,వసంతపూర్,కుమ్మెర,కార్కొండ,పర్వతాయిపల్లి,తుమ్మలసుగూర్,యత్మతాపూర్,పోతిరెడ్డిపల్లి,8 గ్రామాల ప్రజల,రైతుల,విద్యార్థుల చిరకాల స్వప్నం అయిన లింగసానిపల్లి బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యింది. ఈ బ్రిడ్జిని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారి సహకారంతో రూ.3.5 కోట్ల వ్యయంతో నిర్మించారు.* *ఈరోజు బ్రిడ్జిపై 8 గ్రామాలకు చెందిన ప్రజలు, రైతులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, కృతజ్ఞతలు తెలిపారు.* ప్రజలు మాట్లాడుతూ – *“ వర్షాకాలంలో,పాలెం చెరువు అలుగు పారితే వచ్చే వరద ప్రవాహం వల్ల లింగసానిపల్లి దగ్గర 8 గ్రామాల రవాణా వ్యవస్థ బందు అవుతుందని,గత ఎన్నోదశాబ్దాల నుంచి ఎన్నో ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా ఎవరు పట్టించుకోలేదు అని అన్నారు,**తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత TRS ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడంతో సమస్య గురించి 8 గ్రామాల ప్రజలతో చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేసి మాజీ సీఎం కేసీఆర్ గారి సహకారంతో బ్రిడ్జి నిర్మాణం కోసం 3 కోట్ల 50 లక్షల రూపాయలు మంజూరు చేయించి బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి చేయడంతో…* లింగసానిపల్లి బ్రిడ్జి నిర్మాణం వల్ల రవాణా సౌకర్యాలు సులభతరం కావడంతో పాటు, వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్లకు సులభంగా చేరే మార్గం ఏర్పడింది. విద్యార్థుల విద్య, గ్రామాల అభివృద్ధి కొత్త దిశలో ముందుకు సాగుతుందనే విశ్వాసాన్ని ప్రజలు వ్యక్తం చేశారు.* *ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల,ప్రజలు,రైతులు,పలువురు BRS పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు*

జాతీయ అంతర్జాతీయ

సెప్టెంబర్ 7వ తేదిన ఎరుపు రంగులో చంద్రుడు

ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి @ చంద్రగ్రహణం: వచ్చే నెల 7 న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఆ రోజు రాత్రి 8.58 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు తెల్లవారు జామున 1.25 గంటల వరకు ఉంటుంది. ఆ రోజు చందమామ ఎరుపు రంగులో ఉంటాడు. దీంతో చంద్రుడిని బ్లడ్ మూన్ కూడా పిలుస్తారు. మన దేశంలో ఢిల్లీ, ముంబై, కోల్కతా, పుణే, లక్నో, హైదరాబాద్, చండీగఢ్ ప్రాంతాలవారు దీనిని వీక్షించవచ్చు. ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో నేరుగా, స్పష్టంగా చూడొచ్చు.

ఖమ్మం

నిరసన ర్యాలీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకుల అరెస్టు

భారతీయ జనతా పార్టీ Bjp Khammam అధ్యక్షులు Nelluri Koteswara Rao గారి ఆధ్వర్యంలో బీహార్ ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ ఇండియా కూటమి నాయకులు. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి తల్లి గారిని దుర్భాషలాడిన వారిపై చట్ట పరమైన చర్య తీసుకొని రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ చేసి అనంతరం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మని దగ్ధం చేయటం జరిగింది ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులని అరెస్టు చేసి రెండో పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు పాల్గొనడం జరిగింది. శాంతియుతంగా చేస్తున్న నిరసన ర్యాలీపై పోలీసుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం అని జిల్లా నాయకత్వం తెలియజేశారు.

నాగర్‌కర్నూల్

మంగనూరు గ్రామంలో ఘనంగా వినాయక నిమజ్జనం

పున్నమి ప్రతినిధి ఆగస్టు 31 ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం మంగనూరు గ్రామంలో శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో ఏర్పాటు చేసిన గణనాథునికి ఆదివారం ఘనంగా పూజలు నిర్వహించి తోగుట క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ఉట్టి కార్యక్రమాన్ని చిన్నారులతో ఘనంగా నిర్వహించారు. గణనాథుని కి ప్రత్యేక పూజలు నిర్వహించి వీధుల వెంట డిజె పాటలతో కోలాట ఆటలతో నిమజ్జనానికి తీసుకొని వెళ్లారు ఈ కార్యక్రమంలో గ్రామ తోగుట క్షత్రియ సంఘం నాయకులు గ్రామ పెద్దలు మహిళలు యువకులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం 

శ్రీకాకుళంలో న్యూరోసర్జన్ అత్యవసరం : ఎమ్మెల్యే గొండు శంకర్

శ్రీకాకుళం జిల్లాలో న్యూరోసర్జన్ అత్యవసరమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని డే అండ్ నైట్ జంక్షన్ వద్ద సింధూర ఆసుపత్రిలో న్యూరో ఔట్ పేషెంట్ డిపార్టుమెంట్‌ను ఆయన ఆదివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ —న్యూరోసర్జరీ విద్య చాలా క్లిష్టమైనదని, అందువల్ల న్యూరోసర్జన్లు ఎక్కువగా మెట్రో నగరాల ఆసుపత్రుల్లోనే పనిచేయాలని ఇష్టపడతారని తెలిపారు.శ్రీకాకుళం లాంటి జిల్లాలో న్యూరోసర్జన్లు తక్కువగా ఉండటంతో రోడ్డు ప్రమాదాల సమయంలో గోల్డెన్ అవర్‌లో తక్షణ వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.తలకు తగిలే గాయాలకు న్యూరో వైద్యం కీలకమని, విశాఖపట్నం తరలించేలోపు చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు.వైద్యం ఒక పవిత్ర వృత్తి అని, “వైద్యో నారాయణో హరి” అన్నట్లు వైద్యులు దేవుడి సదృశులని ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం వంటి ప్రాంతంలో ఆధునిక సౌకర్యాలతో న్యూరో ఓపీని ఏర్పాటు చేసిన సింధూర ఆసుపత్రి యాజమాన్యానికి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ సింధూర, న్యూరో నిపుణుడు డాక్టర్ అమర్ కార్తీక్, రాజకీయ నాయకులు ఉంగటి రమణ, అంబటి రాజ్యలక్ష్మీ, జామి భీమశంకర్, లయన్స్‌క్లబ్ ప్రతినిధులు నటుకుల మోహన్, బాడాన దేవభూషణరావు, బీజేపీ నాయకులు పాకతోట సింహాచలం, జెసీఐ అధ్యక్షుడు జామి భీమశంకర్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బంగాళాఖాతంలో 2రోజులు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు.

ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి @బంగాళాఖాతంలో: పశ్చిమ బెంగాల్-ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని వలన మంగళవారం (సెప్టెంబర్ 02) నాటికి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులపాటు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తీరం వెంబడి గంటకు 40 -60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. బుధవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని సూచించారు. సోమవారం • శ్రీకాకుళం,విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ,అనకాపల్లి,కాకినాడ, ఏలూరు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. • అంబేద్కర్ కోనసీమ, తూగో,పగో,కృష్ణా,ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.