విజయవాడ: శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలోని వృక్షశాస్త్ర విభాగం మరియు ఎకోక్లబ్ ఆధ్వర్యంలో, IQAC చొరవతో “Green Careers for a Sustainable Tomorrow: Forestry Education and Opportunities with Biodiversity Conservation” అనే అంశంపై అతిథి ఉపన్యాసం ఆగస్టు 31, 2026న వెబినార్ హాల్లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి V. మనోజ్ రెడ్డి, M.Sc. Forestry (Forest Biology and Tree Improvement), Guest Faculty, Acharya Nagarjuna University రిసోర్స్ పర్సన్గా హాజరై విద్యార్థులకు అటవీ విద్య, అటవీ రంగంలోని వృత్తి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి మరియు జీవవైవిధ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.
అటవీ సంపద పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణ, పర్యావరణ సమతుల్యత మరియు స్థిరమైన అభివృద్ధిలో యువత పాత్రను ఆయన వివరించారు. అటవీ శాస్త్రంలో ఉన్న ఉన్నత విద్య, ఉద్యోగ మరియు కెరీర్ అవకాశాలను విద్యార్థులకు తెలియజేశారు.
కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో అడవుల పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణ మరియు పర్యావరణ బాధ్యతపై అవగాహన పెంపొందింది. ప్రకృతి పరిరక్షణతో పాటు అర్థవంతమైన, స్థిరమైన కెరీర్లను ఎంచుకునేందుకు ఈ కార్యక్రమం విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచింది.
ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డా. P. V. దుర్గావతి ప్రోత్సహించగా, వృక్షశాస్త్ర విభాగాధిపతి మరియు ఎకోక్లబ్ కన్వీనర్ T. సలోమి ఆధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.






