Friday, 4 September 2026
  • Home  
  • చేతివృత్తిదారులకు ‘విశ్వకర్మ’ చేయూతపనిముట్ల పంపిణీ: హాజరైన బిజెపి పాలేరు నియోజకవర్గ ఇంచార్జి నున్న రవి కుమార్
- ఖమ్మం

చేతివృత్తిదారులకు ‘విశ్వకర్మ’ చేయూతపనిముట్ల పంపిణీ: హాజరైన బిజెపి పాలేరు నియోజకవర్గ ఇంచార్జి నున్న రవి కుమార్

నేల కొండపల్లి / ఖమ్మం నేలకొండపల్లి మండలం లో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా చేతివృత్తిదారులను ప్రోత్సహించి, వారి కుటుంబాల్లో ఆర్థిక వెలుగులు నింపడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని భారతీయ జనతా పార్టీ పాలేరు అసెంబ్లీ ఇంచార్జ్ నున్నా రవికుమార్ అన్నారు. ఆదివారం పాలేరు అసెంబ్లీ పరిధిలోని నేలకొండపల్లి మండలం అనాసాగరం గ్రామంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన లబ్ధిదారులకు పనిముట్లను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. వాషింగ్ మెషీన్లు, కుమ్మరి వృత్తిదారులకు మట్టి కలిపే (సాన) యంత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నున్నా రవికుమార్ మాట్లాడుతూ అంతరించిపోతున్న సంప్రదాయ చేతివృత్తులను కాపాడి, వృత్తిదారులకు ఆధునిక పనిముట్లతో చేయూత అందించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ విశ్వకర్మ యోజనను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని తెలిపారు. పాలేరు నియోజకవర్గంలో సుమారు 2,000 మంది లబ్ధిదారులకు యంత్రాలు అందించడంతో పాటు బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం కూడా అందించినట్లు పేర్కొన్నారు. అనాసాగరంలో గూనగుంట్ల అనిల్, చల్లగుండ్ల రామారావు, రేగళ్ల రామకృష్ణ, గుణగుంట్ల రామకృష్ణ తదితరులకు పనిముట్లు అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు కోటి హనుమంతరావు, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి మీగడ గోపి, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

నేల కొండపల్లి / ఖమ్మం

నేలకొండపల్లి మండలం లో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా చేతివృత్తిదారులను ప్రోత్సహించి, వారి కుటుంబాల్లో ఆర్థిక వెలుగులు నింపడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని భారతీయ జనతా పార్టీ పాలేరు అసెంబ్లీ ఇంచార్జ్ నున్నా రవికుమార్ అన్నారు. ఆదివారం పాలేరు అసెంబ్లీ పరిధిలోని నేలకొండపల్లి మండలం అనాసాగరం గ్రామంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన లబ్ధిదారులకు పనిముట్లను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. వాషింగ్ మెషీన్లు, కుమ్మరి వృత్తిదారులకు మట్టి కలిపే (సాన) యంత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నున్నా రవికుమార్ మాట్లాడుతూ అంతరించిపోతున్న సంప్రదాయ చేతివృత్తులను కాపాడి, వృత్తిదారులకు ఆధునిక పనిముట్లతో చేయూత అందించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ విశ్వకర్మ యోజనను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని తెలిపారు. పాలేరు నియోజకవర్గంలో సుమారు 2,000 మంది లబ్ధిదారులకు యంత్రాలు అందించడంతో పాటు బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం కూడా అందించినట్లు పేర్కొన్నారు. అనాసాగరంలో గూనగుంట్ల అనిల్, చల్లగుండ్ల రామారావు, రేగళ్ల రామకృష్ణ, గుణగుంట్ల రామకృష్ణ తదితరులకు పనిముట్లు అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు కోటి హనుమంతరావు, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి మీగడ గోపి, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.