పున్నమి ప్రతినిధి ఆగస్టు 23 రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామ శివారులో శనివారం రాత్రి జరిగిన కారు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు కారు అదుపుతప్పి ప్రమాదానికి గురి కావడంతో హసీనా అక్కడికక్కడే మృతి చెందింది తీవ్రంగా గాయపడిన ఆమె భర్త షాదుల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు దంపతుల మృతితో రుద్రంగిలో విషాదఛాయలు అలుముకున్నాయి



