ఖమ్మంజులై
(పున్నమి న్యూస్ )
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర పార్టీ, ఖమ్మం జిల్లా పార్టీ పిలుపు మేరకు సత్తుపల్లిలో బీజేపీ నాయకులు విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం, భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కి ముఖ్య అతిధి గా హాజరైన బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ పెండింగ్ లో ఉపకార వెతనాలు ని వెంటనే విడుదల చేయాలి అని ఆలా లేని పక్షం లో బిజెపి విద్యార్థుల తరుపున పోరాటం చేస్తుందని హెచ్చరించారు
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఫీజులు చెల్లించలేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం ఈ సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని అయన ప్రభుత్వం ని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి సత్తుపల్లి శాసన బిజెపి కంటెస్టడ్ అభ్యర్థి నంబూరి రామలింగేశ్వరరావు, అధికార. ప్రతి నిధి వాకడాని పుల్లారావు, జిల్లా ఉపాధ్యక్షులు సుదర్శన్ మిశ్రా, భాస్కరుని వీరంరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాయుడు రాఘవరావు సత్తుపల్లి పట్టణ అధ్యక్షుడు బాణోతు విజయ్, కార్యదర్శి మందా శివ, డాక్టర్ పెద్దిరాజు, కార్తీక్ యాదవ్ పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


