తేదీ:21-08-2026 శుక్రవారం నాడు ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద PDSU ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రిన్సిపాల్ రూపా రెడ్డి మృతికి కారణమైన కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. యువత చెడు వ్యసనాలకు అలవాట్ల బారిన పడకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో PDSU జిల్లా అధ్యక్షుడు నరేందర్, PDSU నాయకులు నికిల్, ER ఫౌండేషన్ సభ్యులు అర్గుల్ సురేష్, రామ్ చందర్, నూకల శేఖర్, రజనీష్ కిరాడ్, వినోద్, దినేష్, నారా గౌడ్, విట్టోబ శేఖర్, బ్యాంక్ నవీన్, కర్తన్ నవీన్, కాకతీయ శీను, చందూ, శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు.



