యాదాద్రి భువనగిరి జిల్లా నల్లగొండ చౌరస్తా నుండి హైద్రాబాద్ చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ పనులకు ఈరోజు గౌరవ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. అనంతరం స్థానిక కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 ఫీట్ల రోడ్డు ఉన్నప్పటికీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేస్తున్నామని, పూర్తి స్థాయిలో నష్టపోయిన వారికి తగు విధంగా న్యాయం చేస్తామని చెప్పారు, భువనగిరి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని దానికి ప్రజలంతా సహకరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్, వైస్ చైర్ పర్సన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, గ్రంథాలయ చైర్మన్ అవేజ్ చిస్తీ, మాజీ మునిసిపల్ చైర్మన్లు పోతంశెట్టి వెంకటేశ్వర్లు, బర్రె జహంగీర్, మునిసిపల్ కమిషనరు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు కూర వెంకటేష్, కౌన్సిలర్ తాహెరా బబ్లు, బొంతల నర్సింగ్ రావ్, బెండ స్వరూప లాల్ రాజ్, చల్లగురుగుల కృష్ణవేణి రఘుబాబు, సుజాయత్ అలీ కౌసర్, పచ్చల జగన్, లయిక్ అహ్మద్, పోలిశెట్టి అనిల్, బురాన్, చల్ల కిషోర్, మనీష్, శివతేజ, మని, వరుణ్, దినేష్ తదితరులు పాల్గొన్నారు….


