ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి
పెడపర్తి, సెప్టెంబరు 1 (పున్నమి ప్రతినిధి):
ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా అనపర్తి మండలానికి నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్లను 13 మంది లబ్ధిదారులకు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అందజేశారు.
పెడపర్తి పంచాయతీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక పెన్షన్లను అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను, కూటమి నాయకులను కోరారు. ఈ నెలలో నూతనంగా మంజూరయ్యే పెన్షన్లకు సంబంధించి ప్రక్రియను ప్రారంభించి, అర్హులకు పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అనపర్తి మండల, పెడపర్తి గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.








