వినాయక మండపాలకు పోలీసు అనుమతి తప్పనిసరి. SPSR నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 8 పున్నమి తెలుగు దిన పత్రిక కలిగిరి మండలం వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసి విగ్రహాలు ప్రతిష్టించే వారు తప్పనిసరిగా ముందస్తు పోలీసు అనుమతి తీసుకోవాలని ఎస్సై సయ్యద్ లతీ పున్నిషా గారు సూచించారు. ఉత్సవ కమిటీలు ఉచిత ghaneshustav ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మండపాల ఏర్పాటుకు స్థల యజమాని, పంచాయతీ అనుమతులతో పాటు ఫైర్, విద్యుత్ శాఖల నిబంధనలు పాటించాలన్నారు. రహదారులు, ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించకూడదని సూచించారు. లౌడ్స్పీకర్లు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలని, డీజేలు, సామగ్రి నిషేధమన్నారు. నిమజ్జన సమయంలో మద్యం, మత్తు పదార్థాలు సేవిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు


