పున్నమి న్యూస్ మాచర్ల ప్రతినిధి ఆగస్టు 22:
మాచర్ల మండలం, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా మాచర్ల రూరల్ మండలంలోని హస్నాబాద్ తండాలో హియరింగ్ ప్రక్రియ నిర్వహించారు.
అర్హులైన ఓటర్ల వివరాలు, దరఖాస్తులు మరియు అభ్యంతరాలను అధికారులు పరిశీలించారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా సవరణ ప్రక్రియ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొని హియరింగ్ ప్రక్రియను నిర్వహించారు. ప్రజలు తమ ఓటు హక్కుకు సంబంధించిన వివరాలను పరిశీలించుకుని, అవసరమైన సవరణలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు

