టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ నోటీసుపై మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. తన కుమార్తె కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని స్పష్టం చేశారు. కుటుంబ బంధం ఆధారంగా తనను రాజకీయంగా బాధ్యురాలిని చేయడం సముచితం కాదన్నారు. కాంగ్రెస్ నాయకత్వం, పార్టీ క్రమశిక్షణపై సంపూర్ణ గౌరవం ఉందని పేర్కొంటూ, తన ప్రమేయం లేదని గుర్తించి నోటీసును ఉపసంహరించుకోవాలని కమిటీ చైర్మన్ మల్లు రవికి విజ్ఞప్తి చేశారు.

సురేఖ వివరణ లేఖ
టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ నోటీసుపై మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. తన కుమార్తె కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని స్పష్టం చేశారు. కుటుంబ బంధం ఆధారంగా తనను రాజకీయంగా బాధ్యురాలిని చేయడం సముచితం కాదన్నారు. కాంగ్రెస్ నాయకత్వం, పార్టీ క్రమశిక్షణపై సంపూర్ణ గౌరవం ఉందని పేర్కొంటూ, తన ప్రమేయం లేదని గుర్తించి నోటీసును ఉపసంహరించుకోవాలని కమిటీ చైర్మన్ మల్లు రవికి విజ్ఞప్తి చేశారు.

