Thursday, 3 September 2026
  • Home  
  • వెలుగుమట్ల భూదాన్ కూల్చివేత బాధితులపై ముమ్మర సామాజిక–ఆర్థిక సర్వే అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు – కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
- ఖమ్మం

వెలుగుమట్ల భూదాన్ కూల్చివేత బాధితులపై ముమ్మర సామాజిక–ఆర్థిక సర్వే అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు – కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో ఫిబ్రవరి 24న చేపట్టిన ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో ఇండ్లు కోల్పోయిన బాధితులపై సామాజిక, ఆర్థిక సర్వే ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 21 మంది తహశీల్దార్లకు సర్వేను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు నిర్వహించిన సర్వేలో: ఖమ్మం అర్బన్ మండలానికి చెందిన వారు – 182 మంది ఖమ్మం జిల్లాలోని ఇతర మండలాలకు చెందిన వారు – 340 మంది ➡️ మొత్తం ఖమ్మం జిల్లాకు చెందిన వారు – 522 మంది ఇతర వివరాలు ఇలా ఉన్నాయి: రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు చెందిన వారు – 107 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు – 3 మంది సర్వే ప్రక్రియ కొనసాగుతోందని, పూర్తి అయిన అనంతరం అర్హులైన పేదలకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నివాస స్థల పట్టాలు మరియు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడానికి చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు. సర్వే సక్రమంగా పూర్తయ్యేందుకు సంబంధిత వ్యక్తులు తమ తమ గ్రామాల్లో అందుబాటులో ఉండి అధికారులకు సహకరించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )

ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో ఫిబ్రవరి 24న చేపట్టిన ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో ఇండ్లు కోల్పోయిన బాధితులపై సామాజిక, ఆర్థిక సర్వే ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలోని 21 మంది తహశీల్దార్లకు సర్వేను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు నిర్వహించిన సర్వేలో:

ఖమ్మం అర్బన్ మండలానికి చెందిన వారు – 182 మంది

ఖమ్మం జిల్లాలోని ఇతర మండలాలకు చెందిన వారు – 340 మంది
➡️ మొత్తం ఖమ్మం జిల్లాకు చెందిన వారు – 522 మంది

ఇతర వివరాలు ఇలా ఉన్నాయి:

రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు చెందిన వారు – 107 మంది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు – 3 మంది

సర్వే ప్రక్రియ కొనసాగుతోందని, పూర్తి అయిన అనంతరం అర్హులైన పేదలకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నివాస స్థల పట్టాలు మరియు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడానికి చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు.

సర్వే సక్రమంగా పూర్తయ్యేందుకు సంబంధిత వ్యక్తులు తమ తమ గ్రామాల్లో అందుబాటులో ఉండి అధికారులకు సహకరించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.