ఎరువులు, విత్తనాలు, పురుగుమందులను అధిక ధరలకు విక్రయిస్తున్న డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, రైతు సేవా కేంద్రాల ద్వారానే అన్ని రకాల ఎరువులు అందించాలని కోరుతూ రైతు సంఘం, సీఐటీయూ నాయకులు సోమవారం ప్రొద్దుటూరు వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎరువుల విక్రయానికి యాప్ విధానాన్ని రద్దు చేసి, కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం వ్యవసాయ అధికారి వరహారెడ్డికి వినతిపత్రం అందజేశారు. అధిక ధరలకు ఎరువులు, నకిలీ విత్తనాల విక్రయాలపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని అధికారి హామీ ఇచ్చారు.



