రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 2 (పున్నమి ప్రతినిధి)
రాజన్న సిరిసిల్ల: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు చేపట్టిన ఏడు రోజుల నిరసనల్లో భాగంగా జిల్లా అధ్యక్షులు తోట ఆగన్న ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ‘బాకీ కార్డులు’ పంపిణీ చేసి, 420 అడుగుల ఫ్లెక్స్ ప్రదర్శనతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కార్యక్రమంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, తుల ఉమ, చీటి నర్సింగారావు, జనగామ శరత్రావు, చీటి వెంకట నరసింహారావు బొంపల్లి సురేందర్రావు, రాసమడుగు సంతోష్ ,మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి , కొండ శ్రీనివాస్గౌడ్, శీలం స్వామి, అంజిరెడ్డి, నరసింహారెడ్డి, మెంగనీ మనోహర్, కౌన్సిలర్లు, ఏదునూరి శ్రీనివాస్, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



