విశాఖపట్నంలో అత్యాధునిక గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్ను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, శ్రీ స్వామినారాయణ గురుకుల ట్రస్ట్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆగస్టు 22న విశాఖ నోవోటెల్లో జరిగిన బ్రిక్స్ మంత్రుల సమావేశంలో ఎంవోయూపై సంతకాలు జరిగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రభుత్వానికి గురుకుల నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. విలువలతో కూడిన విద్య, ఆధ్యాత్మిక జ్ఞానంతో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు.




