లయన్స్ క్లబ్ ఆఫ్ ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో లైన్స్ క్లబ్
ఆధ్వర్యంలో గొడుగులు పంపిణీ
ఎన్టీఆర్ జిల్లా మైలవరం. పున్నమి న్యూస్ ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా ఆగస్టు 22 2026 శనివారం మైలవరం
లైన్స్ క్లబ్ ఆఫ్ మైలవరం ఆధ్వర్యంలో శనివారం ఫుట్ పాత్ వ్యాపారాలు నిర్వహించేవారికి గొడుగులు పంపిణీ చేశారు. లైన్స్ క్లబ్ ఆప్ మైలవరం ప్రోగ్రాం కన్వీనర్ జాస్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా చిరు వ్యాపారులకు ఎండ, వాన నుండి రక్షణ కవచంగా ఉండేందుకని గొడుగులను పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఆఫ్ మైలవరం పిఎస్టి లు ఏ చంద్రశేఖర్, కోయ శ్రీనివాసరావు, అన్నా బత్తుల రాంబాబు, జెడ్ సి చనుమోలు నాగభూషణం, సీనియర్ లైన్ మెంబర్ తాడేపల్లి వెంకటేశ్వరరావు, లైన్ మెంబర్లు సంగు రాంప్రసాద్, దేవరకొండ అనిల్, మట్ట గోపి, ప్రసాద్ మాస్టారు తదితరులు పాల్గొన్నారు.



