పింఛన్ల పంపిణీ.. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.. వన్స్టాప్ సెంటర్ ప్రారంభం
విశాఖపట్నం జిల్లా, భీమిలి (పున్నమి ప్రతినిధి) ఆగస్టు 31::
భీమిలి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రేపు శ్రీకారం చుట్టనున్నట్లు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్ 1న ఉదయం 10 గంటలకు భీమిలి 3వ వార్డులో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించనున్నారు.
అనంతరం భీమిలి గంటస్తంభం వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రిలో వన్స్టాప్ సెంటర్ను ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమాల్లో భీమిలి నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అర్జీదారులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కార్యాలయం విజ్ఞప్తి చేసింది.

