ఖమ్మం జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా నూతన కమిటీని జిల్లా అధ్యక్షులు నారకుళ్ల వెంకటేశ్వరరావు శుక్రవారం ప్రకటించారు. నూతన కమిటీలో చోటు దక్కిన నాయకులకు బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, రైతుల సమస్యల పరిష్కారానికి కిసాన్ మోర్చా నాయకులు కృషి చేయాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో రైతులకు వివరించాలని అన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. నూతన కమిటీతో ఖమ్మం జిల్లాలో కిసాన్ మోర్చా మరింత బలోపేతం అవుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.



