నంద్యాల :ప్రజా సమస్యల క్షేత్రస్థాయి పరిష్కారం కోసం చేపట్టిన ‘వన్ మంత్–ఫోర్ విజిట్’లో భాగంగా ఈ నెల 28న పాములపాడు ఎంపీడీవో కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు నందికొట్కూరు ఎమ్మెల్యే జి. జయసూర్య పాల్గొని, పాములపాడు, కొత్తపల్లె మండలాల ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించనున్నారు. వివిధ సంక్షేమ, అభివృద్ధి పనులపై వచ్చే అర్జీలను జిల్లా, మండల స్థాయి అధికారులతో సమీక్షించి పరిష్కరిస్తారని పేర్కొన్నారు. రెండు మండలాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

రేపు పాములపాడులో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
నంద్యాల :ప్రజా సమస్యల క్షేత్రస్థాయి పరిష్కారం కోసం చేపట్టిన ‘వన్ మంత్–ఫోర్ విజిట్’లో భాగంగా ఈ నెల 28న పాములపాడు ఎంపీడీవో కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు నందికొట్కూరు ఎమ్మెల్యే జి. జయసూర్య పాల్గొని, పాములపాడు, కొత్తపల్లె మండలాల ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించనున్నారు. వివిధ సంక్షేమ, అభివృద్ధి పనులపై వచ్చే అర్జీలను జిల్లా, మండల స్థాయి అధికారులతో సమీక్షించి పరిష్కరిస్తారని పేర్కొన్నారు. రెండు మండలాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

