నంద్యాల :శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్కు నీటి తరలింపును వెంటనే నిలిపివేసి, రాయలసీమ తాగు, సాగునీటి అవసరాలకు నీటిని భద్రపరచాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఉమ్మడి కర్నూలు జిల్లా నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ను కలసి వినతిపత్రం అందజేశారు.ఇప్పటికే శ్రీశైలం నుంచి 53 టీఎంసీల నీటిని నాగార్జునసాగర్కు తరలించడం రాయలసీమ నీటి భద్రతకు ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జలాల సమస్యపై కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ పరిధిలో పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సమితి నాయకులు ఏరువ రామచంద్రారెడ్డి, మహేశ్వరరెడ్డి, నిట్టూరు సుధాకర్రావు పాల్గొన్నారు.

శ్రీశైలం నీటి తరలింపును ఆపాలి: బొజ్జా దశరథరామిరెడ్డి
నంద్యాల :శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్కు నీటి తరలింపును వెంటనే నిలిపివేసి, రాయలసీమ తాగు, సాగునీటి అవసరాలకు నీటిని భద్రపరచాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఉమ్మడి కర్నూలు జిల్లా నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ను కలసి వినతిపత్రం అందజేశారు.ఇప్పటికే శ్రీశైలం నుంచి 53 టీఎంసీల నీటిని నాగార్జునసాగర్కు తరలించడం రాయలసీమ నీటి భద్రతకు ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జలాల సమస్యపై కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ పరిధిలో పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సమితి నాయకులు ఏరువ రామచంద్రారెడ్డి, మహేశ్వరరెడ్డి, నిట్టూరు సుధాకర్రావు పాల్గొన్నారు.

