రాజంపేట మండలం పాత బస్టాండ్ ఆక్రమణలపై అధికారులు స్పందించాలి.
రాజంపేట మండలం పాత బస్టాండ్ పరిధిలో రోడ్లు, కాలువలను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారని మాజీ పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూల భాస్కర్ ఆరోపించారు. పార్కింగ్ లేకుండా లాడ్జిలు, అగ్నిమాపక అనుమతులు లేకుండా భారీ భవనాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. ఇటీవల శ్రీరామ ఫైనాన్స్ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదం భద్రతా లోపాలను బయటపెట్టిందన్నారు. ఆక్రమణలు తొలగించి, అనుమతులు–భద్రతా ప్రమాణాలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


