విశాఖపట్నం జిల్లా, (పున్నమి ప్రతినిధి) సెప్టెంబర్ 3 ::: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. అక్టోబరులోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు.
టీడీపీ మంత్రులతో జరిగిన సమావేశంలో మంత్రి లోకేష్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని సూచించినట్లు తెలిపారు.
మున్సిపాలిటీలు, అనంతరం MPTC, ZPTC, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఇక వాయిదా వేసే ప్రసక్తి లేదని, నిర్దేశిత గడువులోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోందని మంత్రి లోకేష్ వెల్లడించారు.

