ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మందా సరస్వతి, బీజేపీ జిల్లా కార్యదర్శి శ్రీరామనేని మణి, నాగమణి తదితరులు బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావుకు రాఖీ కట్టారు. రక్షాబంధన్ పండుగ సందర్భంగా సోదరభావం, ఆత్మీయతను చాటుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళా మోర్చా నాయకులు మాట్లాడుతూ రక్షాబంధన్ పండుగ సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. బీజేపీ కుటుంబంలో పరస్పర సహకారం, సోదరభావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళా మోర్చా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



