Thursday, 27 August 2026
  • Home  
  • బాచుపల్లిలో ‘తెలుగింటి కిచెన్’ ప్రారంభం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి
- మేడ్చల్ – మల్కాజిగిరి

బాచుపల్లిలో ‘తెలుగింటి కిచెన్’ ప్రారంభం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి పరిధిలో రామకృష్ణ సరేపూడి నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగింటి కిచెన్ ను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ, యువత స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని అన్నారు. చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. స్థానికంగా వ్యాపారాలు అభివృద్ధి చెందడం ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. యువత ఉద్యోగాల కోసం మాత్రమే ఎదురుచూడకుండా, తమ నైపుణ్యాలను వినియోగించుకుని స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగాలని సూచించారు. అనంతరం ‘తెలుగింటి కిచెన్’ను పరిశీలించిన హన్మంత్ రెడ్డి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపారం విజయవంతంగా కొనసాగి మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొలన్ వీరేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు వారాగాని వాసు, డీసీసీ జనరల్ సెక్రటరీ మౌళేశ్వర్ రావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సత్యప్రసాద్, చిరంజీవి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి పరిధిలో రామకృష్ణ సరేపూడి నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగింటి కిచెన్ ను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ, యువత స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని అన్నారు. చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. స్థానికంగా వ్యాపారాలు అభివృద్ధి చెందడం ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. యువత ఉద్యోగాల కోసం మాత్రమే ఎదురుచూడకుండా, తమ నైపుణ్యాలను వినియోగించుకుని స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగాలని సూచించారు.

అనంతరం ‘తెలుగింటి కిచెన్’ను పరిశీలించిన హన్మంత్ రెడ్డి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపారం విజయవంతంగా కొనసాగి మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొలన్ వీరేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు వారాగాని వాసు, డీసీసీ జనరల్ సెక్రటరీ మౌళేశ్వర్ రావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సత్యప్రసాద్, చిరంజీవి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.