* షో కాజ్ లు ఇచ్చినా స్పందన కరువు
* పై అధికారులు అంటే నిర్లక్ష్య ధోరణి
* సమీక్షలకు తరచూ గైర్హాజరు
నెల్లూరు నగర పరిధిలో మొత్తం 54 డివిజన్ లు ఉండగా 167 సచివాలయాలు ఉన్నాయి . అందులో ఒక సచివాలయం కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలో ఉండగా మిగిలిన 166 సచివాలయాలు కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు షెకెలు అందిస్తున్నాయి . ఈ సచివాలయాలలో అన్ని విభాగాలకు సంబంధించిన కార్యదర్సులు ఉన్నారు . అయితే రాను రాను వీరి పని తీరు నిర్లక్ష్యంగా మారుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు . సచివాలయాలు ఆలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారని పలువురు ప్రజలు విమర్శిస్తున్నారు . ఆయా పని వేళల్లో కూడా వారు కార్యాలయాలలో అందుబాటులో ఉండడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి . ఆయా సీట్లలో వారు లేని సమయాల్లో వారెక్కడ అని అడిగితే ఫీల్డ్ వెరిఫికేషన్ లో ఉన్నారంటూ సమాధానాలు వస్తున్నాయి . కానీ వాస్తవానికి ఆ మాట కి కూడా విలువ ఉండటం లేదు . వారు సచివాలయాలు ఆలా రావడం ఇలా వెళ్లడం జరిగిపోతుంది . ఆకస్మిక తనికీలు కరువు కావడం తోనే ఈ వ్యవస్థ ఇలా అవస్థల పాలు అవుతుందని ప్రజలు తమ అభిప్రాయాలుగా చెప్తున్నారు . ప్రజలకు సరే అందుబాటులో ఉండటం లేదు అన్న విషయాన్ని పక్కన పెడితే సాక్షాత్తు నగర కమీషనర్ నిర్వహించే సమీక్ష సమావేశాలకు కూడా వీరు భారీగానే గైర్హాజరు అవుతున్నారు . ఇలాంటి సమయాల్లో కమీషనర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసి షో కాజ్ నోటీసు లు ఇవ్వమని ఆదేశిస్తున్నారు . ఎన్ని షోకాజ్ లు ఇచ్చిన ఆయా సచివాలయ కార్యదర్శితో మాత్రం మార్పు కాన రావడం లేదు . పై అధికారులు అంటే వారు నిర్లక్ష్య ధోరణని ప్రదర్శిస్తున్నట్లు ఈ వ్యవహారాల వాళ్ళ అర్ధం అవుతుంది . తాజాగా ఇటీవల కమీషనర్ వై ఓ నందన్ సిటీ ప్లానింగ్ కు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహిస్తే అధిక సంఖ్యలో వార్డ్ ప్లానర్ లు గైర్హాజరు అయ్యారు . దీనితో ఆగ్రహించిన కమీషనర్ గైర్హాజరు ఐన వారికి షోకాజ్ నోటీసు లు ఇవ్వమని ఆదేశించారు . అయినా కార్యదర్సుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు . ఈ విషయం పై ఉన్నతాధికారులు గట్టి శ్రద్ధ పెట్టాల్సి ఉంది.

నిర్లక్ష్యానికి నిలువు టద్ధాలుగా సచివాలయాల కార్యదర్సులు
* షో కాజ్ లు ఇచ్చినా స్పందన కరువు * పై అధికారులు అంటే నిర్లక్ష్య ధోరణి * సమీక్షలకు తరచూ గైర్హాజరు నెల్లూరు నగర పరిధిలో మొత్తం 54 డివిజన్ లు ఉండగా 167 సచివాలయాలు ఉన్నాయి . అందులో ఒక సచివాలయం కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలో ఉండగా మిగిలిన 166 సచివాలయాలు కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు షెకెలు అందిస్తున్నాయి . ఈ సచివాలయాలలో అన్ని విభాగాలకు సంబంధించిన కార్యదర్సులు ఉన్నారు . అయితే రాను రాను వీరి పని తీరు నిర్లక్ష్యంగా మారుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు . సచివాలయాలు ఆలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారని పలువురు ప్రజలు విమర్శిస్తున్నారు . ఆయా పని వేళల్లో కూడా వారు కార్యాలయాలలో అందుబాటులో ఉండడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి . ఆయా సీట్లలో వారు లేని సమయాల్లో వారెక్కడ అని అడిగితే ఫీల్డ్ వెరిఫికేషన్ లో ఉన్నారంటూ సమాధానాలు వస్తున్నాయి . కానీ వాస్తవానికి ఆ మాట కి కూడా విలువ ఉండటం లేదు . వారు సచివాలయాలు ఆలా రావడం ఇలా వెళ్లడం జరిగిపోతుంది . ఆకస్మిక తనికీలు కరువు కావడం తోనే ఈ వ్యవస్థ ఇలా అవస్థల పాలు అవుతుందని ప్రజలు తమ అభిప్రాయాలుగా చెప్తున్నారు . ప్రజలకు సరే అందుబాటులో ఉండటం లేదు అన్న విషయాన్ని పక్కన పెడితే సాక్షాత్తు నగర కమీషనర్ నిర్వహించే సమీక్ష సమావేశాలకు కూడా వీరు భారీగానే గైర్హాజరు అవుతున్నారు . ఇలాంటి సమయాల్లో కమీషనర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసి షో కాజ్ నోటీసు లు ఇవ్వమని ఆదేశిస్తున్నారు . ఎన్ని షోకాజ్ లు ఇచ్చిన ఆయా సచివాలయ కార్యదర్శితో మాత్రం మార్పు కాన రావడం లేదు . పై అధికారులు అంటే వారు నిర్లక్ష్య ధోరణని ప్రదర్శిస్తున్నట్లు ఈ వ్యవహారాల వాళ్ళ అర్ధం అవుతుంది . తాజాగా ఇటీవల కమీషనర్ వై ఓ నందన్ సిటీ ప్లానింగ్ కు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహిస్తే అధిక సంఖ్యలో వార్డ్ ప్లానర్ లు గైర్హాజరు అయ్యారు . దీనితో ఆగ్రహించిన కమీషనర్ గైర్హాజరు ఐన వారికి షోకాజ్ నోటీసు లు ఇవ్వమని ఆదేశించారు . అయినా కార్యదర్సుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు . ఈ విషయం పై ఉన్నతాధికారులు గట్టి శ్రద్ధ పెట్టాల్సి ఉంది.

