దొరవారిసత్రం, ఆగస్టు 27 (పున్నమి న్యూస్)*
తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం కుప్పారెడ్డి పాలెం గ్రామంలో నూతన ఆలయ నిర్మాణానికి బుధవారం వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య భూమి పూజ నిర్వహించారు.
గ్రామ అభివృద్ధి మరియు భక్తుల మనోభీష్టం మేరకు ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఇటుకలకు పసుపు కుంకుమలతో అలంకరించి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో ఊరి పెద్దలు శివ రెడ్డి గారు,సుబ్బా రెడ్డి గారు,బుజమ్మ గారు శ్రీనా రెడ్డీ గారు, శ్రీధర్ రెడ్డి గారు,జమ్మల మణి గారు,బల్లి విజయ్ గారు,జమ్మల ఉమాపతి గారు, జమ్మల మనోహర్ గారు, కిన్నెరి రమణయ్య గారు, కిన్నెరి హరిబాబు గారు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



