తేదీ: పున్నమి ప్రతినిధి కొమరం భీం సిర్పూర్ నియోజకవర్గంలోని కార్జెల్లీ గ్రామానికి రాష్ట్ర ఎస్సీ కమిషన్ అధికారులు విచ్చేశారు. డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి ప్రత్యేక కృషి మరియు చొరవతోనే అధికారుల బృందం ఈ ప్రాంతాన్ని సందర్శించింది.
గత కొంతకాలంగా సిర్పూర్ నియోజకవర్గంలో పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రైతులు.. అటవీ (ఫారెస్ట్) అధికారుల తీరుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
అమాయక రైతులను వేధిస్తున్న ఫారెస్ట్ అధికారుల దాష్టీకాలను గట్టిగా ప్రశ్నించడంతో పాటు, బాధిత రైతులకు అండగా నిలిచి భరోసా కల్పించేందుకు ఎస్సీ కమిషన్ అధికారులు కార్జెల్లీ గ్రామంలో పర్యటించి పరిస్థితులను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు.


