BRSLP సమావేశంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. అలాంటి వారితో చర్చించేందుకు తాను అసెంబ్లీకి రావడం అవసరమా అని ప్రశ్నించారు. ‘‘నేను అసెంబ్లీకి రావాలా? వద్దా? మీరే చెప్పండి’’ అని నేతలను అడిగారు. తన చావు కోరుతూ పదేపదే ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనను ‘థర్డ్ క్లాస్ పాలన’గా అభివర్ణించారు. తెలంగాణలో ‘రైజింగ్ కాదు.. ఫాలింగ్’ కనిపిస్తోందన్నారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల వద్దకు లక్ష మందితో వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిద్దామని కేసీఆర్ పిలుపునిచ్చారు.

అసెంబ్లీకి రావాలా?.. మీరే చెప్పండి: కేసీఆర్
BRSLP సమావేశంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. అలాంటి వారితో చర్చించేందుకు తాను అసెంబ్లీకి రావడం అవసరమా అని ప్రశ్నించారు. ‘‘నేను అసెంబ్లీకి రావాలా? వద్దా? మీరే చెప్పండి’’ అని నేతలను అడిగారు. తన చావు కోరుతూ పదేపదే ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనను ‘థర్డ్ క్లాస్ పాలన’గా అభివర్ణించారు. తెలంగాణలో ‘రైజింగ్ కాదు.. ఫాలింగ్’ కనిపిస్తోందన్నారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల వద్దకు లక్ష మందితో వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిద్దామని కేసీఆర్ పిలుపునిచ్చారు.

