Sunday, 6 September 2026
  • Home  
  • కేసీఆర్ నేతృత్వంలో మహా ఉద్యమం: హరీశ్‌రావు
- హైదరాబాద్

కేసీఆర్ నేతృత్వంలో మహా ఉద్యమం: హరీశ్‌రావు

అసెంబ్లీ సమావేశాల అనంతరం కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో లక్షలాది మందితో ప్రత్యక్ష ఉద్యమం చేపడతామని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఎర్రవల్లిలో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై చర్చకు అసెంబ్లీని కనీసం నెలరోజులు నిర్వహించాలని డిమాండ్ చేస్తామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, రుణమాఫీ, కరెంట్ కోతలు, 22ఏ భూములు, ఉద్యోగుల పీఆర్సీ, డీఏలు, ఈహెచ్ఎస్ తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం అవసరమైతే సభను స్తంభింపజేస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం లేదని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్ణయించినట్లు వెల్లడించారు.

అసెంబ్లీ సమావేశాల అనంతరం కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో లక్షలాది మందితో ప్రత్యక్ష ఉద్యమం చేపడతామని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఎర్రవల్లిలో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై చర్చకు అసెంబ్లీని కనీసం నెలరోజులు నిర్వహించాలని డిమాండ్ చేస్తామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, రుణమాఫీ, కరెంట్ కోతలు, 22ఏ భూములు, ఉద్యోగుల పీఆర్సీ, డీఏలు, ఈహెచ్ఎస్ తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం అవసరమైతే సభను స్తంభింపజేస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం లేదని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్ణయించినట్లు వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.