విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. డీఎస్సీ, టెట్ నిర్వహణలో అక్రమాలు జరిగాయని, స్పోర్ట్స్ కోటాలో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చారని పేర్కొన్నారు. పోస్టులను రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అమ్ముకున్నారని ఆరోపిస్తూ, ధైర్యముంటే డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని లోకేష్కు సవాల్ విసిరారు. ఆధారాలను బయటపెడతామని తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు పనుల్లో 85 శాతం వైఎస్సార్, జగన్ హయాంలోనే పూర్తయ్యాయని పేర్కొన్నారు. కరువు పరిస్థితులకు కూటమి ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించాలని ప్రజలను కోరారు.

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి: ఆర్కే రోజా
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. డీఎస్సీ, టెట్ నిర్వహణలో అక్రమాలు జరిగాయని, స్పోర్ట్స్ కోటాలో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చారని పేర్కొన్నారు. పోస్టులను రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అమ్ముకున్నారని ఆరోపిస్తూ, ధైర్యముంటే డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని లోకేష్కు సవాల్ విసిరారు. ఆధారాలను బయటపెడతామని తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు పనుల్లో 85 శాతం వైఎస్సార్, జగన్ హయాంలోనే పూర్తయ్యాయని పేర్కొన్నారు. కరువు పరిస్థితులకు కూటమి ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించాలని ప్రజలను కోరారు.

