Wednesday, 9 September 2026

Tag: YS Jagan

ఆంధ్రప్రదేశ్

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి: ఆర్కే రోజా

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. డీఎస్సీ, టెట్‌ నిర్వహణలో అక్రమాలు జరిగాయని, స్పోర్ట్స్‌ కోటాలో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చారని పేర్కొన్నారు. పోస్టులను రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అమ్ముకున్నారని ఆరోపిస్తూ, ధైర్యముంటే డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని లోకేష్‌కు సవాల్‌ విసిరారు. ఆధారాలను బయటపెడతామని తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు పనుల్లో 85 శాతం వైఎస్సార్‌, జగన్‌ హయాంలోనే పూర్తయ్యాయని పేర్కొన్నారు. కరువు పరిస్థితులకు కూటమి ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించాలని ప్రజలను కోరారు.

ఆంధ్రప్రదేశ్

కరువు కాటేస్తుంటే చంద్రబాబు మౌనం: జగన్

రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వం స్పందించడం లేదని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 52 శాతం వర్షపాతం లోటు ఉందని, 688 మండలాల్లో 625 మండలాలు లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ఖరీఫ్ సాగు తగ్గిందని, రైతులకు సాగునీరు, పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కరువు సహాయక చర్యలు, ప్రత్యామ్నాయ విత్తనాలు, ఉపాధి హామీ పనులపై వెంటనే కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.