నంద్యాల :విధి నిర్వహణలో అమరులైన పోలీసు సిబ్బంది కుటుంబాలు, పదవీ విరమణ చేసిన అధికారుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ తెలిపారు. శుక్రవారం నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అమరుల కుటుంబాలు, రిటైర్డ్ సిబ్బంది సంక్షేమంపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పెన్షన్, ఇతర ఆర్థిక ప్రయోజనాల పురోగతిని సమీక్షించిన ఎస్పీ, పెండింగ్లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించి సకాలంలో ప్రయోజనాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ శాఖలో సేవలందించిన రిటైర్డ్ అధికారులు, అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏఆర్ అదనపు ఎస్పీ చిన్నికృష్ణ, జిల్లా పరిపాలనాధికారులు, పోలీసు అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.

అమరుల కుటుంబాలకు అండగా ఎస్పీ
నంద్యాల :విధి నిర్వహణలో అమరులైన పోలీసు సిబ్బంది కుటుంబాలు, పదవీ విరమణ చేసిన అధికారుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ తెలిపారు. శుక్రవారం నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అమరుల కుటుంబాలు, రిటైర్డ్ సిబ్బంది సంక్షేమంపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పెన్షన్, ఇతర ఆర్థిక ప్రయోజనాల పురోగతిని సమీక్షించిన ఎస్పీ, పెండింగ్లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించి సకాలంలో ప్రయోజనాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ శాఖలో సేవలందించిన రిటైర్డ్ అధికారులు, అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏఆర్ అదనపు ఎస్పీ చిన్నికృష్ణ, జిల్లా పరిపాలనాధికారులు, పోలీసు అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.

