కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 16:
జగ్గంపేట టౌన్ లో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు, నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ పలు పరామర్శలు చేపట్టారు.
జగ్గంపేట గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఆయిల్ స్వామి అనారోగ్యంతో చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారని తెలుసుకుని, బుధవారం నవీన్ నేరుగా వారి స్వగృహానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని, యోగక్షేమాలను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ప్రముఖ దైవజనులు పాస్టర్ సుదర్శన్ తల్లి రత్నం అనారోగ్యానికి గురై విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిసి, వారి ఇంటికి వెళ్లి పరామర్శించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ప్రముఖ అడ్వకేట్ దారా శ్రీను తండ్రి ధారా రాజా ఇటీవల అనారోగ్యానికి గురి అయిన ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. వారిని పరామర్శిసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.జగ్గంపేట గ్రామపంచాయతీ మాజీ వార్డు సభ్యులు కేసు బోయిన చిన్ని భార్య విజయ్ కుమారి అనారోగ్యానికి గురై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. వారిని పలకరించి ఆరోగ్య విషయాలు యోగక్షమారి అడిగి తెలుసుకున్నారు.
కాకినాడ జిల్లా టిడిపి ఎస్సీ సెల్ కార్యదర్శి తుమ్మల కిషోర్ సోదరులు తుమ్మల శ్యాంప్రసాద్ ఇటీవల మరణించడంతో వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలియజేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
కార్యకర్తల కష్టసుఖాల్లో, ప్రజల ఆపద సమయంలో అండగా నిలవడమే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని, ఆ దిశగానే తాము పనిచేస్తున్నామని ఈ సందర్భంగా నవీన్ పేర్కొన్నారు.
ఆయన వెంట జీను మణిబాబు, మారిశెట్టి భద్రం, బుర్రి సత్తిబాబు, కొత్త కొండబాబు, దేవరపల్లి మూర్తి, రేఖ బుల్లిరాజు, పాండ్రంగి రాంబాబు, దాట్ల గోపిరాజు, నండ్ల చిరంజీవి, రాయి సాయి, వెలిశెట్టి బుజ్జి, వెలిశెట్టి రాంబాబు, కోడూరి రమేష్, బండారు నాని, హరి గోపాల్, సాంబత్తుల చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

పలు కుటుంబాలను పరామర్శించిన జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్
కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 16: జగ్గంపేట టౌన్ లో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు, నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ పలు పరామర్శలు చేపట్టారు. జగ్గంపేట గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఆయిల్ స్వామి అనారోగ్యంతో చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారని తెలుసుకుని, బుధవారం నవీన్ నేరుగా వారి స్వగృహానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని, యోగక్షేమాలను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ప్రముఖ దైవజనులు పాస్టర్ సుదర్శన్ తల్లి రత్నం అనారోగ్యానికి గురై విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిసి, వారి ఇంటికి వెళ్లి పరామర్శించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ప్రముఖ అడ్వకేట్ దారా శ్రీను తండ్రి ధారా రాజా ఇటీవల అనారోగ్యానికి గురి అయిన ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. వారిని పరామర్శిసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.జగ్గంపేట గ్రామపంచాయతీ మాజీ వార్డు సభ్యులు కేసు బోయిన చిన్ని భార్య విజయ్ కుమారి అనారోగ్యానికి గురై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. వారిని పలకరించి ఆరోగ్య విషయాలు యోగక్షమారి అడిగి తెలుసుకున్నారు. కాకినాడ జిల్లా టిడిపి ఎస్సీ సెల్ కార్యదర్శి తుమ్మల కిషోర్ సోదరులు తుమ్మల శ్యాంప్రసాద్ ఇటీవల మరణించడంతో వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలియజేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యకర్తల కష్టసుఖాల్లో, ప్రజల ఆపద సమయంలో అండగా నిలవడమే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని, ఆ దిశగానే తాము పనిచేస్తున్నామని ఈ సందర్భంగా నవీన్ పేర్కొన్నారు. ఆయన వెంట జీను మణిబాబు, మారిశెట్టి భద్రం, బుర్రి సత్తిబాబు, కొత్త కొండబాబు, దేవరపల్లి మూర్తి, రేఖ బుల్లిరాజు, పాండ్రంగి రాంబాబు, దాట్ల గోపిరాజు, నండ్ల చిరంజీవి, రాయి సాయి, వెలిశెట్టి బుజ్జి, వెలిశెట్టి రాంబాబు, కోడూరి రమేష్, బండారు నాని, హరి గోపాల్, సాంబత్తుల చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

