మండల కేంద్రమైన సిద్ధవటంలోని బ్రాహ్మణవీధిలో వినాయక చవితి వేడుకలను రెండో వార్షికోత్సవం సందర్భంగా భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
వేడుకల్లో భాగంగా వినాయకుడికి నైవేద్యంగా సమర్పించిన 5 కిలోల లడ్డూను వేలం నిర్వహించారు. ఈ వేలంపాటలో బ్రాహ్మణవీధికి చెందిన బొమ్ము శివ రూ.31,500లకు లడ్డూను దక్కించుకున్నారు. వేలంపాట సందర్భంగా స్థానికులు, భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వినాయక చవితి వేడుకలు రెండో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వీధిలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో సందడి నెలకొంది.


