పాడేరు, సెప్టెంబర్ 03: ప్రజా సమస్యలపై సీసీఆర్ జిల్లా కమిటీ గురువారం జిల్లా అధికారులకు వినతిపత్రాలు అందజేసింది.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా జాయింట్ కలెక్టర్ కు వినతి ఇస్తూ, వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను ప్రోత్సహించి, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగుల విగ్రహాలను నిషేధించాలని కోరారు. దీనివల్ల జలవనరుల కాలుష్యం తగ్గుతుందన్నారు.
అలాగే డీఎం&హెచ్ఓ కు వినతి ఇస్తూ, గర్భిణీలకు రక్త పరీక్షలు, ఇతర వైద్య పరీక్షలు ఒకే ఆసుపత్రిలో అందేలా చర్యలు తీసుకోవాలని, రిఫరల్స్ వల్ల గర్భిణీలు ఆర్థికంగా, శారీరకంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కె.కామరాజు, జి.కామేశ్వరరావు, పి.చిరంజీవి, కె.శివ, ఎం.కొండబాబు పాల్గొన్నారు.


