కౌమార బాలురలో సానుకూల ఆలోచనా విధానం, బాధ్యతాయుత ప్రవర్తన, లింగ సమానత్వాన్ని పెంపొందించే దిశగా నోడల్ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. మహిళా శిశు సంక్షేమ శాఖ–ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, యూనిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబర్ 8, 9 తేదీల్లో అరకులోయ లో ‘కౌమార బాలుర అభివృద్ధి, సాధికారత’పై రెండు రోజుల శిక్షణ జరిగింది. అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగూడ, హుకుంపేట మండలాల ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల ఉపాధ్యాయులు, సమగ్ర శిక్ష కౌన్సిలర్లు పాల్గొన్నారు. యూనిసెఫ్ అధికారి డా. మురళీకృష్ణ, సూర్య ప్రసాద్ శిక్షణ అందించారు. అధికారులు కార్యక్రమాన్ని సందర్శించి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

కౌమార బాలుర సాధికారతకు నోడల్ ఉపాధ్యాయులకు శిక్షణ
కౌమార బాలురలో సానుకూల ఆలోచనా విధానం, బాధ్యతాయుత ప్రవర్తన, లింగ సమానత్వాన్ని పెంపొందించే దిశగా నోడల్ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. మహిళా శిశు సంక్షేమ శాఖ–ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, యూనిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబర్ 8, 9 తేదీల్లో అరకులోయ లో ‘కౌమార బాలుర అభివృద్ధి, సాధికారత’పై రెండు రోజుల శిక్షణ జరిగింది. అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగూడ, హుకుంపేట మండలాల ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల ఉపాధ్యాయులు, సమగ్ర శిక్ష కౌన్సిలర్లు పాల్గొన్నారు. యూనిసెఫ్ అధికారి డా. మురళీకృష్ణ, సూర్య ప్రసాద్ శిక్షణ అందించారు. అధికారులు కార్యక్రమాన్ని సందర్శించి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

