పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 4 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో కాటన్ చీరల కార్మికులు ఆసాముల సమ్మె ఐదో రోజుకు చేరింది నెహ్రూ నగర్ లో అంబా భవాని ఫంక్షన్ హాల్ వద్ద ఏర్పాటుచేసిన శిబిరంలో కూలి పెంపుపై యజమాన్యాల వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు సిఐటియు పవర్ లూమ్ వర్కర్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొండం రమణ మాట్లాడుతూ ఒప్పందం ముగిసి రెండేళ్లు గడిచిన కూలి పెంచలేదని ఆరోపించారు



