ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా రాగల మూడు గంటల వ్యవధిలో రాష్ట్రంలోని పలుచోట్ల తీవ్రమైన పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రభావిత జిల్లాలను అప్రమత్తం చేస్తూ రెడ్, ఎల్లో అలెర్ట్లను ప్రకటించారు.ఉత్తర కోస్తాంధ్ర మరియు పరిసర ప్రాంతాల్లో వాతావరణం అత్యంత తీవ్రంగా మారే అవకాశం ఉండటంతో కింద పేర్కొన్న జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులు పడే తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు జిల్లా అనకాపల్లి కాకినాడ ఎల్లో అలెర్ట్ (Yellow Alert) జిల్లాల వివరాలు: కింది జిల్లాల్లో వాతావరణం సాధారణం కంటే కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఇక్కడ అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.తూర్పుగోదావరి ఏలూరు కృష్ణా బాపట్ల విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచనలు: పిడుగుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలు కింది జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలని విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది. వర్షం కురిసే సమయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు. రోడ్లపై ఉన్నవారు తలదాచుకోవడానికి చెట్ల క్రింద, విద్యుత్ స్తంభాల వద్ద, భారీ హోర్డింగ్స్ (ఫ్లెక్సీలు) వద్ద నిలబడరాదు. రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు పొలాల్లో ఉండకుండా సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలి.

ఏపీ ప్రజలకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు!
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా రాగల మూడు గంటల వ్యవధిలో రాష్ట్రంలోని పలుచోట్ల తీవ్రమైన పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రభావిత జిల్లాలను అప్రమత్తం చేస్తూ రెడ్, ఎల్లో అలెర్ట్లను ప్రకటించారు.ఉత్తర కోస్తాంధ్ర మరియు పరిసర ప్రాంతాల్లో వాతావరణం అత్యంత తీవ్రంగా మారే అవకాశం ఉండటంతో కింద పేర్కొన్న జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులు పడే తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు జిల్లా అనకాపల్లి కాకినాడ ఎల్లో అలెర్ట్ (Yellow Alert) జిల్లాల వివరాలు: కింది జిల్లాల్లో వాతావరణం సాధారణం కంటే కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఇక్కడ అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.తూర్పుగోదావరి ఏలూరు కృష్ణా బాపట్ల విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచనలు: పిడుగుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలు కింది జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలని విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది. వర్షం కురిసే సమయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు. రోడ్లపై ఉన్నవారు తలదాచుకోవడానికి చెట్ల క్రింద, విద్యుత్ స్తంభాల వద్ద, భారీ హోర్డింగ్స్ (ఫ్లెక్సీలు) వద్ద నిలబడరాదు. రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు పొలాల్లో ఉండకుండా సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలి.

