పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్
ఎలమంచిలి మండలం పులపర్తి గ్రామములో వ్యవసాయ శాఖ వారు నిర్వహించే పొలం పిలుస్తుంది కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎమ్ ఆశా దేవి పెంటకోట సూర్యారావు వరి పొలంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి జిల్లా వ్యాప్తంగా ఎల్ నినో ను దృష్టిలో పెట్టుకొని వర్షపాతం 50% తక్కువగా నమోదు కావడం చేతన వరి కి ప్రత్యామ్నాయంగా రాగులు, జొన్నలు, గంట్లు, జనుమ మరియు ఉలవలు తక్కువ నీటి వసతి గల పంటలను వేసుకోవాలని సూచించారు రైతులు తమ పంటలను సకాలంలో ధాన్యం అమ్మకాలు చేయాలన్నా ప్రభుత్వ పథకాలు కొనసాగాలన్న ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ,రైతులు నీటిపారుదల కింద ఉడుపులు జరిగినట్లయితే వెంటనే పసల్ బీమా యోజన ఇన్సూరెన్స్ చేయించుకోవాలని, ఎలమంచిలి మండలంలో 130 మెట్రిక్ టన్నులు యూరియా 45 మెట్రిక్ టన్నులు డిఏపి అందుబాటులో ఉన్నదని కావలసిన రైతులు రైతు సేవా కేంద్రాలు మరియు సొసైటీ ద్వారా వినియోగించుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మోహన్ రావు తో పాటు వ్యవసాయ సహాయకులు హేమ పాల్గొన్నారు


