రాజన్న సిరిసిల్ల జులై 18 (పున్నమి ప్రతినిధి)
ముస్తాబాద్లో రూ.32 లక్షల CMRF చెక్కుల పంపిణీ – పేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
ముస్తాబాద్:
ముస్తాబాద్ మండలంలో మొత్తం 71 మంది లబ్ధిదారులకు రూ.32 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గజ్జెల రాజు, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి ఏళ్ళ బాల్రెడ్డి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు CMRF ఎంతో ఊరటనిస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


