నంద్యాల: వినాయక చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (POP), రసాయన రంగుల విగ్రహాలను వినియోగించకుండా మట్టి విగ్రహాలనే ఉపయోగించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ప్రజలకు పిలుపునిచ్చారు.కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 13న నంద్యాల జిల్లా కేంద్రంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. POP విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితం అవుతున్నందున పర్యావరణ పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు.విగ్రహాల తయారీ, విక్రయ కేంద్రాలపై అధికారులు పర్యవేక్షణ చేపడతారని, పర్యావరణ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని అధికారులు తెలిపారు.

పర్యావరణహిత వినాయక చవితికి జిల్లా యంత్రాంగం పిలుపు
నంద్యాల: వినాయక చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (POP), రసాయన రంగుల విగ్రహాలను వినియోగించకుండా మట్టి విగ్రహాలనే ఉపయోగించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ప్రజలకు పిలుపునిచ్చారు.కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 13న నంద్యాల జిల్లా కేంద్రంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. POP విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితం అవుతున్నందున పర్యావరణ పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు.విగ్రహాల తయారీ, విక్రయ కేంద్రాలపై అధికారులు పర్యవేక్షణ చేపడతారని, పర్యావరణ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని అధికారులు తెలిపారు.

