*గిరిజనులల్లో వున్న దృష్టిలోపాన్ని నివారిస్తాం.*
*తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగుకు అశ్రునివాళి.*
*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 29 చిట్టమూరు మండలం,*
చిట్టమూరు మండలం గుణపాడు గిరిజన కాలనీలో నివాసం ఉంటున్న కాలనీవాసులకు గత రెండు రోజుల క్రితం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి అందులో దృష్టిలోపం ఉన్న వారిని గుర్తించారు.
శనివారం తెలుగు భాషా దినోత్సవం మరియు గిడుగు వెంకట రామమూర్తి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని దృష్టిలోపమున్న గిరిజనులకు వృద్ధులకు కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన ఎం వి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంస్థ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ ఆ కాలనీవాసులకు కంటి అద్దాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం గురించి గిడుగు. వెంకట రామమూర్తి గురించి ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ లీలామోహన్ కృష్ణ గిరిజనకు తెలియజేశారు.
గిరిజనుకు తెలుగు భాష ఉద్యమ స్ఫూర్తి గిడుగు అని అభివర్ణించారు.
అనంతరం దృష్టిలోపం ఉన్న ప్రతి ఒక్కరికి కంటి అద్దాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ.
కార్యదర్శి ఎం విజయలక్ష్మి గుణపాడు గిరిజన కాలనీవాసులు దృష్టిలోపం ఉన్న వృద్ధులు పాల్గొన్నారు.



