పున్నమి: హైదరాబాద్, వనస్థలిపురం ప్రజలకు అందుబాటులోకి వారాహి సిల్క్స్ 6వ స్టోర్ ప్రముఖ వస్త్ర దుకాణం రానుంది. వనస్థలిపురం ‘ఎక్స్’ రోడ్స్లోని బొమ్మిడి ఎలైట్ టవర్స్లో వారాహి సిల్క్స్ నూతన దుకాణం ఆగస్టు 22న ఉదయం 11 గంటల నుంచి ఘనంగా ప్రారంభం కానుంది.
వారాహి సిల్క్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ నూతన దుకాణంలో సంప్రదాయ పట్టు చీరలు, వివిధ రకాల చీరలు, వివాహ వేడుకలకు అనువైన వస్త్రాల ప్రత్యేక సేకరణ అందుబాటులో ఉండనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సంప్రదాయ వస్త్రాలపై ఆసక్తి ఉన్న వినియోగదారులకు విస్తృత శ్రేణి ఎంపికలు అందించనున్నట్లు పేర్కొన్నారు.
ప్రారంభోత్సవానికి నటుడు తేజ సజ్జ, నటి మీనాక్షి చౌదరి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు ప్రచార ప్రకటనలో వెల్లడించారు. ఆగస్టు 22 నుంచి 31 వరకు ప్రత్యేక ప్రారంభోత్సవ రాయితీలను అందిస్తున్నట్లు తెలిపారు.
వెండి ఆభరణాల కొనుగోలుపై రూ.25 వేల నుంచి కొనుగోలు చేస్తే 25 శాతం వరకు రాయితీతో పాటు 5 గ్రాముల వెండి నాణెం ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించారు. రూ.లక్షకు పైగా వెండి ఆభరణాల కొనుగోలుపై 30 శాతం వరకు రాయితీతో పాటు 100 మిల్లీగ్రాముల బంగారు నాణెం అందించనున్నట్లు తెలిపారు. నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు.
వనస్థలిపురం హిల్ కాలనీ, హయత్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా దుకాణాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రారంభోత్సవానికి వినియోగదారులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ ప్రత్యేక అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.



