వైఎస్ఆర్ బాటలోనే మా పోరాటం: కోమటిరెడ్డి రాజగోపాల్
వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి పేదలు, రైతుల సంక్షేమానికి ఆదర్శ నాయకుడని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులతో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఉదయసముద్రం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించిందన్నారు. కాంగ్రెస్ బలోపేతానికి ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడాన్ని స్వాగతిస్తామని, అయితే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించబోమని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.



