Friday, 4 September 2026

Tag: Special

నంద్యాల

ఆర్‌ఏఆర్‌ఎస్ పరిరక్షణకు ఉధృతమైన పోస్టుకార్డు ఉద్యమం

నంద్యాల: ఆర్‌ఏఆర్‌ఎస్‌ (ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం) నుంచి తాత్కాలిక కలెక్టరేట్‌ను వెంటనే తరలించాలని, నూనెపల్లె మార్కెట్‌యార్డులో టీడీపీ కార్యాలయానికి కేటాయించిన రెండు ఎకరాల స్థలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష ఐక్యవేదిక చేపట్టిన పోస్టుకార్డు ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా శుక్రవారం గిరినాథ్ సెంటర్‌లో నిర్వహించిన రెండో విడత కార్యక్రమంలో ప్రజలు పోస్టుకార్డులపై తమ డిమాండ్లను రాసి ప్రభుత్వానికి పంపించారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌లో కలెక్టరేట్ వల్ల పరిశోధనలకు విఘాతం కలుగుతోందని ఐక్యవేదిక అధ్యక్షుడు ఏర్వ రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కో-కన్వీనర్లు జానయ్య, మహేశ్వర్‌రెడ్డి, శంకరయ్య, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.