తిరుపతి ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి
తిరుపతి జిల్లాలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 807 గ్రామపంచాయతీలు, 7,342 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఆగస్టు 21లోపు పోలింగ్ కేంద్రాల వివరాలు సిద్ధం చేయాలని, 650 మందికి పైగా ఓటర్లు ఉన్న చోట అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

