మహానంది: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో శ్రీ కామేశ్వరీ అమ్మవారికి శ్రావణమాస నాలుగో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈఓ ఎన్. శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో లోకకళ్యాణార్థం అమ్మవారిని ఏకంగా 15 వేల గాజులతో సుందరంగా అలంకరించారు.ఈ గాజుల అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆలయ వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక అర్చనలు, మంగళహారతులు సమర్పించారు. శ్రావణ శుక్రవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కామేశ్వరీ అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు.

15 వేల గాజులతో కామేశ్వరీ అమ్మవారికి వైభవంగా పూజలు
మహానంది: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో శ్రీ కామేశ్వరీ అమ్మవారికి శ్రావణమాస నాలుగో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈఓ ఎన్. శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో లోకకళ్యాణార్థం అమ్మవారిని ఏకంగా 15 వేల గాజులతో సుందరంగా అలంకరించారు.ఈ గాజుల అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆలయ వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక అర్చనలు, మంగళహారతులు సమర్పించారు. శ్రావణ శుక్రవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కామేశ్వరీ అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు.

