Thursday, 3 September 2026

Tag: అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు

శ్రీకాకుళం 

దన్నానపేటలో పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే కూన రవికుమార్ మంగళవారం ఆమదాలవలస మండలం దన్నానపేట గ్రామంలో పర్యటించారు. గ్రామస్థాయిలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులతో ఆయన మాట్లాడి సంతృప్తి వ్యక్తం చేశారు. దన్నానపేట గ్రామంలో చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. దివ్యాంగులు,వితంతువులు, వృద్ధులకు అవసరమయ్యే నిత్యవసర ప్రయోజనాలను సమకూర్చేందుకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కలింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని శేఖర్, అన్నేపు భాస్కర్ రావు, ఎంపిటిసి గొర్లె సూర్యం, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.