ఖమ్మం
ఖమ్మం పున్నమి ప్రతి నిధి ఖమ్మం జిల్లాబి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి యువనేత కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన కేక్ కటింగ్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో జిల్లా పార్టీ ముఖ్య నాయకులతో, కార్పొరేటర్లు, తెలంగాణ ఉద్యమకారులతో కలిసి రక్తదాన శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు ప్రారంభించారు. కేక్ కటింగ్ అనంతరం లాంగ్ లీవ్ కేటీఆర్ అంటూ.. పెద్ద ఎత్తున నినాదాలు చేసిన పార్టీ నాయకులు కార్యకర్తలు… ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు మాట్లాడుతూ: తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. MLC, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ గారి ఆధ్వర్యంలో కేటీఆర్ గారి పుట్టినరోజు వేడుకలు జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని, కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మరియు ఖమ్మం జిల్లాలో సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదాయకమైన విషయమై తెలిపారు. కేటీఆర్ గారు అధికారంలో ఉన్న లేకున్నా తన పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ద్వారా నిరుపేదలకు, విద్యార్థులకు సమాజంలోని అన్ని వర్గాల వారికి ఉపయోగకరమైన కార్యక్రమాలకు పిలుపునిస్తూ.. ప్రతి సంవత్సరం వారి పుట్టినరోజు సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు విద్యార్థులకు లాప్టాప్ లు, ఫీజులు, ప్రభుత్వ ఆసుపత్రులకు అంబులెన్సులు, వికలాంగులకు వాహనాలు ఉపయోగపడే విధంగా సమాజానికి అందిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రగతిలో ఐటీ రంగం రాష్ట్రంలో విస్తృతంగా ఏర్పాటు చేయడంలో లక్షలాది ప్రైవేటు ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు అందించేందుకు కృషి కేటీఆర్ చేశారని, సామాజిక సేవలో నిత్యం ముందుండే కేటీఆర్ గారు ఆయురారోగ్యాలతో ఉండాలంటూ కోరుకుంటూ.. కేటీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ రాబోయే స్థానిక ఎన్నికల్లో అఖండ విజయం సాధిస్తుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బిఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారం చేపడుతుందని పరిచారు. ఈ కార్యక్రమంలో ఆర్ జె సి కృష్ణ, కూరాకుల నాగభూషణం, ఉప్పల వెంకటరమణ, బొమ్మెర రామ్మూర్తి, బి రెడ్డి, సొసైటీ బ్యాంక్ చైర్మన్ బి రెడ్డి నాగచంద్ర రెడ్డి, మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ ఖమర్, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు తాజుద్దీన్, బిచ్చల తిరుమలరావు, నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, రూరల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, రఘునాధపాలెం మండలం అధ్యక్షుడు వీరు నాయక్, తిరుమలాయపాలెం మండల పార్టీ అధ్యక్షులు భాషబోయిన వీరన్న, పిన్ని కోటేశ్వరరావు, కార్పొరేటర్లు శీలంశెట్టి వీరభద్రం, దండా జ్యోతి రెడ్డి, కూరాకుల వలరాజు, శ్రీవిద్య, బత్తుల మురళి, మాజీ ముదిగొండ మండల జడ్పీటీసీ సామినేని హరిప్రసాద్, మహిళా నాయకురాలు భారతి, కొల్లు పద్మ, నాయకులు బంక మల్లన్న, శంకర్, బిక్షం, ఇంటూరి శేఖర్, ముత్యాల వెంకటప్పారావు, మెంటం రామారావు, మీగడ శ్రీనివాస్ యాదవ్, పగడాల నరేందర్, లింగనబోయిన సతీష్, బలుసు మురళీకృష్ణ, మహమ్మద్ రసూల్, సద్దాం షేక్, మద్దెల విజయ్, మాటేటి కిరణ్, చీకటి రాంబాబు, షారుక్, ఆసిఫ్, అప్సర్, బురాన్, ఆరెంపుల వీరభద్రం, ఉస్మాన్, మన్సూర్, నెమలికొండ వంశీ, నెమలి కిషోర్, నారమళ్ళ వెంకన్న, ఎల్వీ రత్నం, షకీన, శైలజా, మాధవి మరియు తదితరులు పాల్గొన్నారు.